Telangana

వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బీ.టెక్ తొలి ఏడాది విద్యార్థులు సోమవారం తమ వినూత్నమైన ప్రాజెక్టులకు ప్రదర్శించారు. సాంకేతిక అన్వేషణ, ఉత్పత్తి ఇంజనీరింగ్ (టీఈపీ టెప్) కార్యక్రమంలో భాగంగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో అభివృద్ధి చేసిన వినూత్న ప్రాజెక్టుల ఎగ్జిబిషన్ ను గీతం విద్యార్థులు నిర్వహించారు.బీటెక్ తొలి ఏడాది విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నెపుణ్యాలను పెంపొందించడం, ప్రయోగాత్మక విధానాన్ని పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ప్రోగ్రామింగ్, సిమ్యులేషన్, మెకానిజమ్స్, మ్యాచింగ్ కలయికను ఉపయోగించడం ద్వారా బహుళ- క్రమశిక్షణా ప్రాజెక్టు-ఆధారిత సామర్థ్యాలను ఇది ప్రోత్సహిస్తుంది. దీనికి అదనంగా, ప్రాజెక్టు మేనేజ్మెంట్, సంస్థాగత నెపుణ్యాలతో విద్యార్థులను సన్నద్దం చేస్తుంది.విద్యార్థులు తమ అభ్యాసాలను ప్రదర్శించడానికి ఈ ప్రాజెక్టు ఎగ్జిబిషన్ ఒక వేదికగా ఉపయోగపడింది. ఈ సెమిస్టర్లో సుమారు 15 గ్రూపుల విద్యార్థులు పాల్గొని, సూక్ష్మంగా రూపొందించిన నమూనాలను ప్రదర్శించారు.త్రిపుర విద్యుత్ నియంత్రణ సంస్థ (టీఈఆర్సీ) చెర్మన్ డి.రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.శ్రీనివాస్, బీటెక్ తొలి ఏడాది ప్రోగ్రాం ఇన్చార్జి ప్రొఫెసర్ పి.త్రినాథరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గీతం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి, అద్భుత సృజనాత్మకతను ప్రదర్శించిన విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు.విద్యార్థులు తమ సాంకేతిక నెపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అవకాశం కల్పించడమే కాకుండా ఆవిష్కరణ, ఆచరణాత్మక అభ్యాసాన్ని పెంపొందించడంలో గీతం నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago