– జాతీయస్థాయి బిట్స్ టెక్ ఎక్స్పోలో ద్వితీయ , తృతీయ స్థానాలు కైవసం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటి , తమ అత్యుత్తమ సాంకేతికత , ప్రదర్శనలకు గాను ద్వితీయ , తృతీయ స్థానాలను కెవసం చేసుకున్నారు . జీ – ఎలక్ట్రా ( స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ ) విద్యార్థులు ఇటీవల బిట్స్ హైదరాబాద్ వార్షిక ఫెస్ట్ ‘ ఆటమ్స్ – 22’లో తమ హోం ఆటోమేషన్ , బ్లెండెడ్ విజన్ ప్రాజెక్టులకు గాను నగదు పురస్కారాన్ని పొందినట్టు ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . దేశ నలుమూలల నుంచి పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని , తమ నమూనాలు / ప్రోటోటెస్ట్ ప్రాజెక్టులను ప్రదర్శించినట్టు ఆమె తెలిపారు . గీతం ఈఈసీఈ రెండో ఏడాది విద్యార్థులు సి.దీపక్ , జి . అనిరుధ్ , బి.గురుప్రీత్ సింగ్ , సీహెచ్ . అమూల్యల బృందం హోం ఆటోమేషన్ ప్రాజెక్టును , మూడో ఏడాది విద్యార్థులు ఎంవీఎస్ఎన్ ప్రణవ్ , కె . మణికంఠ , దివ్యసాగర్ బృందం విజన్ ప్రాజెక్టులను ప్రదర్శించి , న్యాయమూర్తుల ప్రశంసలను పొందినట్టు డాక్టర్ మాధని వివరించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పరిశోధనా ఇంజనీర్ వె.దామోదర్రావు , జీ – ఎలక్ట్రో క్లబ్ సమన్వయకర్తలు డాక్టర్ డి.అనిత , ఎం.నరేష్ కుమార్లు తదితరులు జాతీయస్థాయి పోటీలలో రాణించిన ఈ రెండు జట్ల సభ్యులను అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…