– జాతీయస్థాయి బిట్స్ టెక్ ఎక్స్పోలో ద్వితీయ , తృతీయ స్థానాలు కైవసం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటి , తమ అత్యుత్తమ సాంకేతికత , ప్రదర్శనలకు గాను ద్వితీయ , తృతీయ స్థానాలను కెవసం చేసుకున్నారు . జీ – ఎలక్ట్రా ( స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ ) విద్యార్థులు ఇటీవల బిట్స్ హైదరాబాద్ వార్షిక ఫెస్ట్ ‘ ఆటమ్స్ – 22’లో తమ హోం ఆటోమేషన్ , బ్లెండెడ్ విజన్ ప్రాజెక్టులకు గాను నగదు పురస్కారాన్ని పొందినట్టు ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . దేశ నలుమూలల నుంచి పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని , తమ నమూనాలు / ప్రోటోటెస్ట్ ప్రాజెక్టులను ప్రదర్శించినట్టు ఆమె తెలిపారు . గీతం ఈఈసీఈ రెండో ఏడాది విద్యార్థులు సి.దీపక్ , జి . అనిరుధ్ , బి.గురుప్రీత్ సింగ్ , సీహెచ్ . అమూల్యల బృందం హోం ఆటోమేషన్ ప్రాజెక్టును , మూడో ఏడాది విద్యార్థులు ఎంవీఎస్ఎన్ ప్రణవ్ , కె . మణికంఠ , దివ్యసాగర్ బృందం విజన్ ప్రాజెక్టులను ప్రదర్శించి , న్యాయమూర్తుల ప్రశంసలను పొందినట్టు డాక్టర్ మాధని వివరించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పరిశోధనా ఇంజనీర్ వె.దామోదర్రావు , జీ – ఎలక్ట్రో క్లబ్ సమన్వయకర్తలు డాక్టర్ డి.అనిత , ఎం.నరేష్ కుమార్లు తదితరులు జాతీయస్థాయి పోటీలలో రాణించిన ఈ రెండు జట్ల సభ్యులను అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…