త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం….
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో స్మశానవాటిక నిర్వహణపై కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మనిషి తన జీవితకాలంలో చివరి మజిలీనీ ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటారని, ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా రుసుములు నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే స్మశాన వాటికకి సంబంధించి ట్రయల్ పనులు సైతం పూర్తయినట్లు తెలిపారు. కరోనా వైరస్ తో మరణించిన మృతదేహాలకు 7500 రూపాయలు, సహజ మరణాల మృతదేహాలకు ఆరువేల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మశాన వాటిక ను నిర్మించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…