Telangana

అంతా గణితమయం: ప్రొఫెసర్ వై.ఎన్.రెడ్డి

గీతంలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

– శ్రీనివాస రామానుజన్ కు ఘన నివాళి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగే ఏకైక భాష గణితం అని, గణితం లేని ప్రదేశం లేదా జీవితం లేదని, అంతా గణితమయం అని ఎన్ఐటీ వరంగల్ గణిత శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ వై.ఎన్.రెడ్డి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణిత శాస్త్రజ్జుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వాస్తవానికి ఈనెల 22న ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి, కానీ వరుస సెలవుల వల్ల రెండు రోజుల ముందే నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వై.ఎన్.రెడ్డి ‘గణితం: నేర్చుకునే భాష’ అనే అంశంపై ఉపన్యసించారు. విశ్వజనులందరిలోకీ భారతీయులకి గణిత శాస్త్రంపై పట్టు అపారమని, దీనిని యువత గుర్తెరిగి, ఆ రంగంలో రాణించేందుకు యత్నించాలని పిలుపునిచ్చారు.

గణితంపై పట్టు సాధిస్తే, ఎంతటి చిక్కు సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చని, అందుకే భారతీయులు అత్యున్నత స్థానాలలో రాణిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం ప్రభుత్వం ‘శకుంతల’ పథకం కింద గణితంలో బంగారు పతకం సాధించిన విద్యార్థినులకు నేరుగా పీహెచ్ డీ ప్రవేశాలు కల్పించడమే గాక, గౌరవ ఉపకార వేతనాన్ని కూడా అందజేసి, ప్రోత్సహిస్తున్నట్టు డాక్టర్ రెడ్డి తెలిపారు.గౌరవ అతిథిగా పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ గణితాచార్యుడు డాక్టర్ రాజేష్ కన్నా, ‘ఎలా లెక్కించాలి?’ అనే అంశంపై మనోహరమైన ఉపన్యాసంతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. ప్రతి దానికీ పునాది గణితంపై ఆధారపడి ఉందని, అందువల్ల గణిత నేపథ్యం ఉన్నవారికి అపార ఉపాధి అవకాశాలున్నట్టు ఆయన చెప్పారు.గీతం సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొల్లూరు శ్రీకృష్ణ వర్చువల్ గా కీలకోపన్యాసం చేస్తూ, యువతను గణితం వైపు ప్రేరేపించడంతో పాటు ఆయా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను వారిలో పెంపొందించాలని సూచించారు.

తొలుత, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజా అతిథులను స్వాగతిస్తూ, దైనందిన జీవితంలో గణిత శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ సహాధ్యక్షుడు ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ వందన సమర్పణ చేశారు. అధ్యాపకులు, విద్యార్థి సమన్వయకర్తలు డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, డాక్టర్ కృష్ణ కుమ్మరి, నందిత, షాజియా ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక భూమిక పోషించారు.ఈ వేడుకలో క్విజ్, మ్యాథమెడికల్ మోడల్-పీపీటీ ప్రజెంటేషన్ వంటి పలు ఆకర్షణీయమైన పోటీలను నిర్వహించి, విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రుద్రారంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, మల్కాపూర్ లోని అక్షయ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరచి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago