ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి…

Hyderabad

ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి…

హైదరాబాద్:

లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని పటాన్ చెరు వీర శైవ లింగాయత్ సమాజం యువకులు సంగమేష్ , విజేందర్ , నరేందర్ , నాగప్ప అన్నారు . ఆదివారం పటాన్ చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కమాన్ వరకు రోడ్డు పక్కన పేదలకు ఆహార పదార్థాలను , వాటర్ బాటిళ్లను అందజేశారు . 150 మందికి అన్నంతో పాటు వాటర్ బాటిల్ లను అందజేశారు.

ఈ సందర్భంగా వీర శైవ లింగాయత్ సమాజం యువకులు సంగమేష్ ,విజేందర్ మాట్లాడుతూ… తమ వంతు సాయంగా నిరుపేదలకు అన్నం తో పాటు వాటర్ బాటిల్ లను అందజేశామన్నారు. ఇతరులకు సాయం చేయడంలో ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *