బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేత…
శేరిలింగంపల్లి :
సమాజ సేవ చేయాలనే లక్ష్యం తో ఏర్పాటు చేసిన బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హఫీజ్ పెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో హఫీజ్ పెట్ డివిజన్ ఇంచార్జ్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చేతుల మీదుగా N-95 మాస్కులు, శానిటైజర్ లు అందజేయడం జరిగింది. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్షిన్ తీసుకోవాలని, వైద్యులకు సహకరించాలని కోరారు. ఒకరి పై ఆధారపడకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కారోనా కట్టడికి తమవంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ బాబు, మెడికల్ ఆఫీసర్ రవీందర్, బోయిని మల్లేష్ యాదవ్, మంజుల, భవాని, కవిత ,నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
