ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తానని పటాన్ చెరు మాజీ సర్పంచ్ , ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల మండలం వీరారెడ్డి పల్లిలోని ప్రైమరీ స్కూల్లో టీవీ సౌకర్యం లేక ఆన్లైన్ తరగతులు నిర్వహించడం లేదు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న దేవేందర్ రాజు స్కూల్కు పదహారు వేల విలువ చేసి టీవీని అందించారు. పాఠశాలలో చదువుతున్న ముప్పై మంది విద్యార్థులకు టీవీ ద్వారా ఆన్లైన్ ద్వారా పాఠాలు వినే అవకాశం కల్గింది.
టీవీ లేక ఇబ్బందులు పడుతున్న తమ పాఠశాలకు కొత్త టీవీని అందించిన ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజుకు ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు .ఇక నుంచి ప్రతి రోజు విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా విద్యాభోధన అందించేందుకు కృషి చేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు . గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలను దత్తత తీసుకుని మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు .సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజును పలువురు అభినందించారు .
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…