టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి….
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
కరోనా కష్ట కాలంలోనూ రంజాన్ పర్వదినం పురస్కరించుకొని అర్హులైన ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని పెద్ద మసీదు ప్రాంగణం లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వారి వారి ప్రధాన పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యం తో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. కరోనా మూలంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికిని సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వం పంపిణీ చేసేందుకు నిర్ణయించిందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మసీదు కమిటీ ఆధ్వర్యంలో వారి వారి పరిధిలోని అర్హులైన నిరుపేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…