పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
సృజనాత్మకత లేదా ఏదైనా ఒక కళారూపం పోటీ నుంచి వస్తుందని, అది ఏ సందర్భంలో, ఎక్కడ, ఎవరు, ఎలా రాశారు అనే దాని గురించి ప్రత్యేకంగా చెబుతుందని ‘బీబీల గది’ (బీబీస్ రూమ్) రచయిత్రి నజియా అక్తర్ అన్నారు. హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించి ‘నారీ కి కలమ్ సే’ (మహిళా రచయితల సంబరాలు)లో ఆమె అతిథిగా పాల్గొన్నారు.గీతం స్టూడెంట్ లెఫ్ సౌజన్యంతో మహిళా లీడర్స్ ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘బీబీస్ రూమ్’ పుస్తక రచనానుభవాలను ఆమె విద్యార్థులతో పంచుకున్నారు. తాను హైదరాబాద్ సంస్థాన అధికార మార్పిడిపై లోతైన పరిశీలన చేపట్టానని, ఆ క్రమంలోనే అప్పట్లో మహిళా రచయితలు, వారి రచనల గురించి తెలిసినట్లు నజియా చెప్పారు. విభజన సమయంలోని మహిళా సాహిత్యం తనకు పెద్దగా లభించలేదని, అయితే కొందరు వారి ఇళ్లలో ఉన్న రచనలను తనతో పంచుకోవడం ప్రారంభించారని, అలా అధికార మార్పిడి సమయంలో మహిళల జీవనం ఎలా ఉండేది, వారి సృజనాత్మక రచనల గురించి తెలిసిందన్నారు.
అలా ఆయా కుటుంబాల్లోని తల్లులు, సోదరీసుణులు, అమ్మమ్మలు ఉర్దూ భాషలో, గద్య రూపంలో రాసిన 150 పుస్తకాలను తాను అధ్యయనం చేసినట్టు అకర్ హెదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ కావడం వల్ల హెదరాబాద్ ఉర్దూరచయిత్రుల సాహిత్యం ఉందని చాలామందికి తెలియదని నజియా చెప్పారు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…