Telangana

వెనుజులపై అమెరికన్ దాడిని ఖండించండి సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

అమెరికన్ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని సిఐటియు జిల్లా కోశాధికారి కేరాజయ్య అన్నారు. వెనుజుల పై అమెరికన్ దాడిని నిరసిస్తూ ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణం లో శ్రామిక్ భవన్ నుంచి జాతీయ రహదారి వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వెనిజులపై దాడిని ప్రపంచం మొత్తం ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు, ఒక దేశం పై అమెరికా పెత్తనం ఏమిటి అని ప్రశ్నించారు, టెర్రరిస్టుల కంటే భయంకరంగా అమెరికన్ సైన్యం విరుచుకుపడిందన్నారు.ఒక దేశ అధ్యక్షుడు భవనంపై రాత్రిపూట దాడి చేసి, ప్రజల ప్రాణాలు తీసి అధ్యక్షుని అతని భార్యని కిడ్నాప్ చేయడం ఏమిటని, అమెరికాకు ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నించారు.

అమెరికా చేస్తున్న అరాచకాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని,అమెరికన్ సామ్రాజవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు, గత అనేక సంవత్సరాల నుంచి వెనుజుల దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని, తమ చెప్పు చేతిలో ఉంచుకోవాలని అమెరికా కోరుకున్నదన్నారు, ప్రపంచంలోనే వెనుజులలో ప్రత్యమయ ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న దేశమని, అది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెనిజులలో ఇంధన నిక్షేపాలు గనినీయంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

ఇంధనం పైన పెత్తనం కోసమే అమెరికన్ దాడి చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు వెనుజుల అధ్యక్షుడి భార్య ఎక్కడ ఉందో కూడా ప్రకటన చేయలేదని, వెంటనే మీడియాకు చూపించాలని, వెనిజుల నుంచి అమెరికన్ సైన్యం వెంటనే వెనుకకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అమెరికన్ దానిని భారత దేశ ప్రజలు, సంఘాలు, పార్టీలు ఖండించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, సాయన్న, నరసింహారెడ్డి, నరసింహులు, నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

1 day ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

1 day ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago