Telangana

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో జిహెచ్ఎంసిలో చందానగర్ సర్కిల్ నాలుగవ స్థానం

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 2024-25 ఆస్థి పన్ను వసూలు రికార్డు స్థాయిలో వసూలైన సందర్బంగా జిహెచ్ఎంసి రెవెన్యూ విభాగానికి (30 సర్కిళ్లకు) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా చందానగర్ సర్కిల్-21 నాలుగవ స్థానం వచ్చినందున చందానగర్ సర్కిల్ రెవెన్యూ విభాగన్ని సన్మానించారు.ఈ సందర్బంగా చందానగర్ సర్కిల్ ఉప కమీషనర్ పి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 109.54 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు తెలిపారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, టాక్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మొత్తం బృందం సమిష్టి కృషి వల్ల ఈ ఘనత సాధించగలిగామని తెలిపారు.

చందానగర్ రెవిన్యూ విభాగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం లొ సర్కిల్ రెవెన్యూ విభాగం ఏఎంసీలు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా ఆస్తి పన్ను ఏప్రిల్ 30వ తేదీ లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందే అవకాశం ఉందని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎర్లీ బర్డ్ స్క్రీం అందుబాటులో ఉందని తెలిపారు. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నుకు మాత్రమే ఎర్లీ బర్డ్ స్కీం వర్తింస్తుందని, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై ఎర్లీ బర్డ్ స్కీం వర్తించదని ఉప కమీషనర్ పేర్కొన్నారు.

శనివారం, ఆదివారం, సోమవారం మరియు ఏప్రిల్ నెలలోని అన్ని సెలవు రోజులలో బిల్ కలెక్టర్లు అందుబాటులో ఉంటారని, సర్కిల్ ఆఫీస్ సిటిజన్ సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో ఉంటుందని, ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, మీ సేవా సెంటర్ల లొ ఆస్థి పన్ను చెల్లిoచుకోవచ్చని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చందానగర్ సర్కిల్ ప్రజలకు ఉప కమిషనర్ మోహన్ రెడ్డి కోరారు.

 

 

 

admin

Recent Posts

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

34 minutes ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago