Hyderabad

వచ్చే ఆరు నెలల్లో ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో సీసీ కెమెరాలు

వడక్ పల్లి లో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్

వచ్చే ఆరు నెలల్లో నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం అమిన్ పూర్ మండల పరిధిలోని వడక్ పల్లి గ్రామంలో లక్షన్నర రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం తోపాటు గ్రామం మొత్తం నిఘా నేత్రం లో ఉంటుందని అన్నారు.

అందరి సహాయ సహకారాలతో వచ్చే ఆరు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. మినీ ఇండియాగా పోవడం జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తూ ఉంటారని అన్నారు.

 

యువత పెడదోవ పట్టకుండా పోలీసులతో పాటు గ్రామ పెద్దలు కృషి చేయాలని సూచించారు. డిఎస్పి భీమ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లలితా మల్లేష్, సిఐ శ్రీనివాసులు రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, గ్రామ పెద్దలు రాంరెడ్డి, పాలక వర్గం సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read :

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago