మనవార్తలు ,తెల్లాపూర్
_ విద్యా భారతి పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణం కోసం ఐదు లక్షల విరాళం అందించిన గడీల శ్రీకాంత్ గౌడ్
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తానని పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతుల కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు .సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ, నాగులపల్లి గ్రామంలో విద్యా భారతి పాఠశాలను గతంలో ఆయన పరిశీలించారు. పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణం కోసం గడిల శ్రీకాంత్ గౌడ్ ఐదు లక్షల విరాళం ప్రకటించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామని ప్రకటనలకే పరిమితమైందని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు.
ఇటీవల తాను పటాన్ చెరువు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించానని అక్కడ కనీసవసతులు కరువయ్యాయని తెలిపారు. ప్రభుత్వం పేరుకే మన ఊరు, మన బడి కార్యక్రమం అంటూ గొప్పలు చెబుతుందని క్షేత్ర స్థాయిలో మాత్రం ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వం పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేదన్నారు.పాఠశాలలు ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు పుస్తకాలు అందించలేదన్నారు. దీనిని బట్టి విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. డిజిటల్ పాఠాలు కేవలం డిజిటల్ ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు శంకర్ ,తెల్లాపూర్ కౌన్సిలర్ శంషాబాద్ రాజు ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, పటాన్ చెరు మండల్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ హనుమంతరావు ,మాజీ బీజేవైఎం జిల్లా నాయకులు రాంబాబు, పటాన్చెరు మండల్ ఓ బి సి అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…