మనవార్తలు ,రామచంద్రాపురం :
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి ఏకే ఫౌండేషన్ అసరాగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన ఎండీ ఫజిల్ గత రెండు సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ఐదు సంవత్సరాల వయస్సున్న ఫాజిల్ కుమారుడు ఎండీ తోఫిక్ ను చదించేందుకు ముందుకువచ్చాడు. బాలుడిని షైన్ మోడల్ స్కూల్ లో చేర్పించి ఫీజులు చెల్లించాడు. అంతేకాకుండా బాలుడి చదువు అవసరమయ్యే పుస్తకాలు , స్కూల్ డ్రెస్ లను ఏకే ఫౌండేషన్ చెల్లించింది. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదీర్ ను స్థానికులు అభినందించారు .
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…