అమీన్పూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా చివరి రోజైన శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంపొందించాలన్న సమున్నత లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఇందుకు అనుగుణంగా వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ కోట్లాది మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం తో పాటు, సరిపడ నిధులు సైతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి వార్డు లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజల సమక్షంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…