క్యాన్సర్ బాధిత బాలుడికి ఆర్థిక సహాయం..

రూ 30,000 అందజేసిన సర్పంచ్ నీలం మధు గారు చిట్కుల్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు చికిత్స నిమిత్తం తన వంతుగా 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. రామచంద్రపురం పరిధిలోని ఎంఐజి ఫేస్-2 కు చెందిన ఎం.గౌతమ్, స్రవంతి దంపతుల కుమారుడు ఎం.గౌతమ్ వెలిమెలలోని తెలంగాణ మోడల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి. తమ కుమారుడి వైద్యం కోసం సహాయం కోరగా గురువారం తన నివాసంలో […]

Continue Reading

ఈజీ మనీ…. పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మోసం

హైదరాబాద్ పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మూడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. పెట్రోల్ బంక్ లో సాఫ్ట్ వేర్ లను మార్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుండేవారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక లో కలిపి మొత్తం 34 పెట్రోల్ బంక్ లలో మైక్రో చిప్ ల ద్వారా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ […]

Continue Reading

అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఇంజరాపు పూజ 

ఖమ్మం ఖమ్మం  మండలం పెద్దతండాలో ప్రియదర్శిని మహిళ ఇంజనీరింగ్ కాలేజ్ లో సైబర్ నేరాలు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆంశలపై అవగాహన పెంపొందించడానికి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యతిధిగా డీసీపీ ఇంజరాపు పూజ, వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అనేక పనులు వేగంగా జరుగుతుంటాయని, అయితే దీంతో […]

Continue Reading

మ‌హిళాభ్యున్న‌తికి పెద్ద‌పీట‌ వేస్తున్న వైసీపీ ప్రభుత్వం:ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని

అడ‌గ‌కుండానే జ‌గ‌న‌న్న వ‌రాలు నాదెండ్ల‌లో ఘ‌నంగా వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం ప్రారంభం గుంటూరు జిల్లా మ‌హిళాభ్యున్న‌తికి పెద్ద పీట వేస్తున్న ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మండ‌ల కేంద్రం నాదెండ్ల‌లో వైఎస్సార్ భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని గురువారం ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడు కూడా అడిగితేనే వ‌రాలిస్తాడ‌ని త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు అడ‌గ‌కుండానే ఎన్నో వ‌రాలు ఇస్తున్నార‌ని తెలిపారు. ఇప్పుడు ద‌స‌రా […]

Continue Reading

జగనన్న ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా.. కార్వేటినగరంలో నిర్వహించిన 2వ విడత ఆసరా కార్యక్రమానికి హాజరైన చిత్తూరు జెడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు) ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా గా నవరత్నాలు, అమ్మబడి, ఫీజు రియంబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు, డ్వాక్రా రుణమాఫీ, రైతు భరోసా మొదలైన […]

Continue Reading

సుల్తాన్పూర్, ఐలాపూర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చీరల పంపిణీ అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు అమీన్ పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, సుల్తాన్పూర్ గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు బతుకమ్మ పండుగ విశిష్టతను […]

Continue Reading

దొడ్ల పాల షాప్ ప్రారంభించిన గణేష్ ముదిరాజ్

శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియపూర్ డివిజన్ పరిధిలోని పి.ఏ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్ల పాల షాప్ ను స్థానిక బీజేపీ నాయకులు గుండే గణేష్ ముదిరాజ్ గురువారం ప్రారంభించారు. నాణ్యత తో వ్యాపారం చేస్తూ ప్రజలు ఆధారాభిమానాన్ని చూరగొనాలని నిర్వాహికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జాజిరావ్ శ్రీను, రేపన్ వెంకటేష్, జాజిరావ్ రాము,శ్రీధర్, దుర్గేష్, రాజేందర్, నరేష్, షాప్ యజమానులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

వైభవంగా హ్యాండ్‌బాల్‌ ఓపెనింగ్‌ సెర్మనీ

* కొవిడ్ తర్వాత నగరంలో జరుగుతున్న తొలి నేషనల్‌ ఈవెంట్‌ * ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాస్‌ గౌడ్‌ హైదరాబాద్‌: హైదరాబాద్‌ వేదికగా ఇంత పెద్ద జాతీయ స్థాయి స్పోర్ట్స్‌ ఈవెంట్‌ నిర్వహించడం రాష్ట్రానికే తలమానికమని క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. గురువారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జాతీయ సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ను మంత్రి, శాట్స్ చైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, భార‌త ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వ‌ర్ పాండే, జాతీయ హ్యాండ్‌బాల్ […]

Continue Reading