అధిక వడ్డిలు వసూలు చేస్తే నేరుగా సమాచారం ఇవ్వండి : డిఐజి రంగనాధ్

నల్లగొండ : జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టడం జరిగిందని, వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ ప్రజలను కోరారు. జిల్లాలో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మితిమీరిన వడ్డీల వసూళ్లు, లాక్ డౌన్ ఈ.ఎం.ఐ.ల పేరుతో బాదుతున్న చక్రవడ్డీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా వడ్డీ వ్యాపారుల వేధింపులు, అధిక వడ్డిలు వసూలు చేస్తున్న వారి వివరాలు, […]

Continue Reading

చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే బాక్సింగ్ క్రీడాకారులకు ఎమ్మెల్యే అనంత అభినందనలు

అనంతపురం : గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. చదువుతో పాటు క్రీడలూ అవసరమేనన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన జాతీయ స్థాయి బాలికల బాక్సింగ్ పోటీల్లో నగరానికి చెందిన దీక్షిత,పెద్దక్క,శిల్ప,గీత,పూజలు పతకాలు సాధించారు. వీరంతా మంగళవారం ఎమ్మెల్యే అనంతను ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్‌లో మరింతగా రాణించి ఉన్నత […]

Continue Reading

నాయీబ్రాహ్మణ సంక్షేమంపై బుక్ లెట్ విడుదల

సీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి అనంతపురం : బి సి ల అభ్యున్నతి లక్ష్యం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే అనంత నివాసంలో నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూపొందించిన నాయీబ్రాహ్మణ సంక్షేమ బుక్ ను ఎమ్మెల్యే అనంత విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంక్ గా మాత్రమే […]

Continue Reading

ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడుతున్న పోలీసులు వందలో ఒక్కరే ఉంటారు

తూర్పుగోదావరి జిల్లా తల్లి తన కొడుకు, కూతురుతో పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు, ఎస్ ఐ ఎస్ లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని వారి యొక్క ప్రాణాలకు తెగించి కాలువలో దూకిన బాధితులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు పీకల్లోతు నీటిలో మునిగిపోయారు. అదృష్టవశాత్తు సీఐ సురేష్ బాబుకు పెనుప్రమాదం తప్పింది. […]

Continue Reading

కొడకంచి మాజీ ఉప సర్పంచ్   పాతూరి మల్లేష్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిక

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని కొడకంచి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ప్రస్తుత వార్డు సభ్యులు పాతూరి మల్లేష్ గాంధీభవన్ మాజీఉపముఖ్యమంత్రి రాజనర్సింహ పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలకు […]

Continue Reading

తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట

తెలంగాణ ఎంతో ప్రతిష్టాత్మక మైన తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట ” అల్లిపూల వెన్నల ” రిలీజ్ అయింది. తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ విడుదల చేశారు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. తెలంగాణ ఆడపడుచల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. ప్రపంచం మెచ్చిన సంగీత […]

Continue Reading

అక్టోబర్‌7 నుంచి  షిర్డీ సాయిబాబా దర్శనానికి అనుమతి

షిర్డీ:  ఎన్నో రోజులుగా షిర్డీ వెళ్లాలనుకుని ఎదురుచూసే బాబా భక్తులకు ఇది తీపి కబురు. కరోనా కారణంగా మూసివేసిన షిర్డీ ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. నవరాత్రుల తొలిరోజైన అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులకు అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈమేరకు పలు నియమ నిబంధనలు పాటిస్తూ సాయిబాబాను దర్శించుకోవచ్చని ఎస్‌ఎస్‌ఎస్‌టీ పేర్కొంది. అవేంటంటే.. * అక్టోబరు7 (గురువారం) నుంచి ప్రతిరోజూ 15 వేల భక్తులకు మాత్రమే సాయి దర్శనం […]

Continue Reading

పటాన్చెరులో 14 న బతుకమ్మ, 15 న దసరా ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలో ఈ నెల 14న బతుకమ్మ పండుగ, 15వ తేదీన దసరా పండుగను నిర్వహించాలని పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కోదండ సీతారామస్వామి దేవాలయం లో పండగ తేదీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ పండగలు జరుపుకోవాలని సూచించారు. సద్దుల బతుకమ్మను సాకి చెరువు […]

Continue Reading

సంకల్ప అనాథ ఆశ్రమంలో బాల బాలికలకు పాఠ్యపుస్తకాల పంపిణీ

శేరిలింగంపల్లి: సామాజిక కార్యకర్త అయిన మధుకర్ 4వ వర్ధంతి సందర్బంగా విబిసిసి క్లబ్ తరుపున బయ్యారపు రోజా ,సునీల్ దంపతులు సంకల్ఫ్ అనాధ ఆశ్రమంలో పాఠ్య పుస్తకాలు ,పెన్నులు,తినిబండరాలను అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 40 మంది బాలబాలికలకు అందచేశారు .ఈ సందర్బంగా ఆశ్రమ నిర్వాహకులు VBCC క్లబ్ ని ప్రత్యేకంగా అభినందించి ,ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టి పేద విద్యార్థులకు మరి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని […]

Continue Reading

సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

పటాన్చెరు రుద్రారం గ్రామంలోని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సియా లైఫ్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ వారి సహకారంతో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు .అనంతరం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సియా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యజమానికి మరియు డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారి వైద్య పరికరాలతో వచ్చి గ్రామం మొత్తం ఉచిత వైద్యం చేసి మరియు బీపీ షుగర్ […]

Continue Reading